కోవిడ్ థర్డ్ వేవ్: వచ్చే 125 రోజులు అత్యంత ప్రమాదకరమట!

భారత్ కోవిడ్ రెండో దశ విజృంభణ ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తోంది. ఈ సమయంలో కోవిడ్ థర్డ్ వేవ్ ప్రమాదం ముంచుకొస్తుందని అందరూ జాగ్రత్తగా ఉండాలని కేంద్ర సర్కార్ హెచ్చరికలు జారీ చేసింది. ఈనేపథ్యంలోదేశంలో కోవిడ్ మహమ్మారి ముప్పు ఇంకా తగ్గలేదని రాబోయే 125రోజులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. కోవిడ్ వైరస్ కు వ్యతిరేకంగా మనదేశం ఇంకా హెర్డ్ ఇమ్యూనిటీ సాధించలేదని స్పష్టం చేసింది. కోవిడ్ వైరస్ సంక్రమణ కొత్త వ్యాప్తి అవకాశాలను తోసిపుచ్చలేమన్నది. రాబోయే 125రోజులు కఠినమైనవిగా సూచించింది. దీంతో వచ్చే 125రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలంటూ నీతిఅయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ హెచ్చరికలు జారీ చేశారు.
ఇక ఆరోగ్య మంత్రిత్వ శాక ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకేపాట్ ఈ కీలక కామెంట్స్ చేశారు. కోవిడ్ వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే అనుకూలమైన ప్రవర్తనను అలావాటు చేసుకోవడంతోపాటుగా కఠినమైన పద్దతులను పాటించడం ద్వారా సాధ్యమవుతుందన్నారు. మనం ఇంకా హెర్డ్ ఇమ్యూనిటీని సాధించలేమన్నారు. ప్రస్తుతం వైరస్ లో కొత్త కొత్త మార్పులు వస్తున్నాయన్నారు. ముందుగా వాటిని అడ్డుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. చాలా దేశాల్లో కోవిడ్ పరిస్థితి మరింతగా దిగజారిపోతోందన్ని వీకేపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచం మూడో దశ వైపు పయనిస్తోందంటూ హెచ్చరించారు.
ప్రస్తతం ఈ మహమ్మారిలో కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాటిని మనం అడ్డుకోవాలి. సురక్షితమైన జోన్లో ఉండటానికి కరోనా కట్టడికి అనుకూలమైన ప్రవర్తనను మనం అనుసరించినట్లయితే ఇది సాధ్యమైతుందని తెలిపారు. చాలా దేశాల్లో వైరస్ పరిస్తితి మరింత దిగజారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. మనదేశంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడానికి మేము రెండో దశ మధ్య ఉన్న సమయం వినియోగించుకుంటున్నాం. WHO హెచ్చరికను జారీ చేసిందని దాని నుంచి మనం చాలా నేర్చుకోవాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇతర దేశాలతో కరోనా మూడో దశ గురించి చర్చించారన్నారు.
ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ మాట్లాడారు. పొరుగుదేశాలలో కోవిడ్ వైరస్ కోసులు భారీగా పెరుగుతున్నాయన్నారు. మయన్మార్, ఇండోనేషియా, మలేషియా, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్నాయన్నారు. ఆయా దేశాల్లో రెండో దశ కన్నా మూడో దశ ప్రభుత్వం ఎక్కువగా ఉందన్నారు. కోవిడ్ మహమ్మారి కట్టడికిసంబంధిత ఆంక్షలు సడలించినప్పటి న నుంచి భారత్ లో మాస్క్ వాడకం బాగా తగ్గిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. లాక్ డౌన్ తర్వాత దేశంలో మాస్క్ వాడకంలో74శాతం తగ్గిందని అంచనా వేసింది.
అయితే తాజాగా ICMR సైంటిస్ట్ మూడో దశపై స్పష్టతనిచ్చారు. మూడోదశ ఆగస్టులో విజ్రుభిస్తుందని చెప్పారు. రోజుకు లక్ష కేసులు నమోదయ్యే అవకాశం ఉంటుందని ప్రొఫెసర్ సమిరన్ పాండా అన్నారు. అయితే పరిస్థితి మాత్రం మొదటి దశ మాదిరిగానే ఉంటుందన్నారు. కానీ తర్వాత పరిస్థితిని అంచనా వేయలేమని హెచ్చరించారు. ICMRలో ఎపిడెమోలాజీ సంక్రమణ వ్యాధుల విభాగానికి పాండి HODగా ఉన్నారు. పరిస్థితి ఎలా దిగజారుతుందని ప్రశ్నిస్తే ICMR లండన్ ఇంపిరీయల్ కాలేజీలో చేసిన పరిశోధన గురించి వివరించారు. తక్కువ సంఖ్యలో టీకాలు ఇవ్వడం వల్ల కూడా కేసులు పెరగవచ్చన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. సామూహిక సమావేశాల్లో మాస్క్ ధరించకపోవడం వల్ల ఇన్ ఫెక్షన్ పెరిగే ఛాన్స్ ఉంటుందన్నారు. ప్రస్తుతం టీకా కార్యక్రమం మందగించిందని…ఇది అత్యంత ప్రమాదకరమన్నారు. పర్యాటకులను అనుమతించడం వల్ల ఇతర ప్రాంతాలు రావడంతో ఇబ్బందులు తలెత్తెప్రమాదం ఉందన్నారు. ఇప్పుడు డెల్టా వేరియంట్ ద్వారా 86శాతం మందికి ఇన్ ఫెక్షన్ సోకుతుందని వివరించారు