NASA: స్పేస్ లో మిర్చి పంట…నాసా మరో ప్రయోగానికి శ్రీకారం..!

ఆకాశం..అంతరిక్షయానం…దీనిపై గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచంలోని చాలా దేశాల శాస్త్రవేత్తలు పరిశోధనలు, ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు అంతరిక్ష ప్రయోగాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆకాశం అనంతం. దాని గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే. ఇంకా తెలుసుకోవల్సింది ఎంతోఉంది. ఎన్ని ప్రయోగాలు చేసినా…విశ్వం గురించి పూర్తిగా తెలుసుకోవడం అనేది అసంభవం. అయితే ఆకాశంలో ఉండే కొన్ని అద్భుతాలు వాటి వెనక ఉన్న రహస్యాల గురించి అక్కడి వాతావరణం గురించి తెలుసుకునే ప్రయోగాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి.
ఈ సమయంలోనే నాసా మరో ముందడుగు వేసింది. స్పేస్ లో మిరపకాయల్ని పండించే ప్రయత్నంలో భాగంగా సగం విజయం సాధించింది. 15000 వేల కోట్ల అమెరికన్ డాలర్ల ఖర్చు చేసింది. ఐదు దేశాల స్పేస్ ఏజెన్సీలు కలిసి ఏర్పాటు చేసి ప్రపంచ అంతరిక్షయానంలో విరపకాయలని సాగుచేస్తోంది. మెక్సికన్ జాతికి చెందిన మేలైన హట్చ్ రకపు మిరపగింజలు ఈ జూన్ లో స్పేస్ ఎక్స్ కమర్షియల్ సర్వీస్ ద్వారా స్పేస్ స్టేషన్ కు చేరుకున్నాయి. ఈ పరిశోధనకు షేన్ కిమ్ బ్రాగ్ నేత్రుత్వం వహిస్తున్నారు.
ఓవెన్ సైజులో ఉండే సైన్స్ క్యారియర్ అనే డివైజ్ లో వీటిని పండిస్తున్నారు. ఇక ఇవి పూర్తిస్తాయిలో ఎదగడానికి ఇంకో నాలుగు నెలల సమయం పట్టొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక నాసా దీన్ని సుదీర్ఘమైన సంక్లిష్టమైన పరిశోధనగా అభివర్ణిస్తోంది. వ్యోమగాములకు ఆహార కొరత తీర్చే చర్యల్లో భాగంగా ఈప్రయోగాలు చేస్తున్నట్లు నాసా తెలిపింది. అయితే గతంలోనూ ఇలానే పూలు, దుంపల సాగు కోసం ప్రయత్నించారు. అయితే జీరోగ్రావిటీ ల్యాబ్ లో మిరపకాయలని పండించడం వీలు కాదని శాస్త్రవేత్తలు నాసాతో ఛాలెంట్ చేశారు. ఈ నేపథ్యంలో చాలెంజింగ్ గా తీసుకున్నా నాసా మంచి ఫలితాలను రాబట్టింది. సాధారణంగా స్పేస్ ప్రయాణంలో వ్యోమగాములు వాసన రుచి సామర్థ్యం కోల్పోతారని తెలుసు. ఆ సమయంలో వాళ్లు స్పైసీ ఆహార పదార్థాలకు ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ సమయంలో ఈ ప్రయోగం మంచి ఫలితాన్ని ఇచ్చిందని నాసా అభిప్రాయపడుతోంది.